పల్నాడు: వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను కెమెరాలో గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, మూడు పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ఫారెస్ట్లోకి వెళ్లొద్దని, నీరు కోసం గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.