సత్యసాయి: ధర్మవరంలోని బలిజ కల్యాణ మండపం వద్ద హిందూ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హరిత ధర్మవరమే లక్ష్యంగా పట్టణంలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు.