KDP: పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో శనివారం ఉదయం స్వచ్ఛతా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పొడి, చెత్తలను వేరు చేయు విధానం, హోం కంపోస్టింగ్పై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మానవహారం, సామూహిక శుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు.