TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల పట్ల బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారో రేవంత్ చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. అలాగే, రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 1994లోనే గుజరాత్లో కాంగ్రెస్ సర్కారు మోదీ కులాన్ని బీసీలో చేర్చిందని గుర్తుచేశారు.