కృష్ణా: కోడూరు మండల పరిధిలోని హంసలదీవి సమీపంలో ఉన్న సముద్ర తీరం వద్ద మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం సింధు స్నానాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణా జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సంగమ ప్రాంతంలో స్నానాలు చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్రజలు వేకువజామునే భారీగా వాహనాలపై వచ్చి సముద్ర స్నానాలు చేశారు.