KMM: మిర్చి బస్తాలను దుండగులు చోరీ చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆటోలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పంట పెట్టుబడి కోసం రూ. లక్షలు అప్పుగా తీసుకొచ్చి, ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటను దుండగులు చోరీ చేశారని బాధిత రైతు వాపోయాడు.