BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం చేపల మార్కెట్ ఏరియాలో ఇటీవల కిన్నెరసాని పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ కోసం తవ్విన గుంటలను మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం ఆ పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపైకి చేరి అసౌకర్యంగా మారుతోందని బుధవారం స్థానికులు చెప్పారు. గుంటలను పూడ్చిన మట్టి లీకైన నీటితో బురదమయంగా మారుతోందని తెలిపారు.