హీరో నాగచైతన్య-శోభిత దంపతులు ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాసిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకావిష్కరణ నిమిత్తం ఈ జంట ప్రధానితో భేటీ అయింది. ఈ మేరకు నాగచైతన్య ట్వీట్ చేశారు. మోదీతో కలిసి తీసుకున్న ఫొటోని పోస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.