GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పోలవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్రి బాలరాజు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, వీరమహిళ రావి సౌజన్య ఉన్నారు.