SDPT: బనేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలంలోని గోనెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. యువత ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు.