BDK: దమ్మపేట లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ తరగతి చదువుతున్నారు భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు. కొంతమందిని పాఠాలు చదివిస్తూ వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు.