AKP: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్ రాయవరం ఎంపీడీవో మీనా కుమారి డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 15వ తేదీలోగా శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.