WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో వివాహిత పిండి మానస (30) తన కూతురు సాత్విక(3)కు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా మానసను కుటుంబీకులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో HYDకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మానస మరణించారు .పోలీసులు కేసు నమోదు చేశారు.