ELR: పోలీసు నియామక పరీక్షలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సివిల్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఏలూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.