SKLM: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డీటీ త్రినాధరావు, మండల సర్వేయర్ రఘు, విఆర్ఓ సన్యాసిరావు, సచివాలయ సర్వేయర్ జగపతి, తదితరులు పాల్గొన్నారు.