NRML: భైంసాకు చెందిన ఫ్రెండ్స్ ఫుట్ బాల్ క్లబ్ టీమ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సన్మానించి అభినందించారు. ఈనెల 19న ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ పోటిలో జిల్లా స్థాయి విజేతగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా కప్ను అందుకున్నారు. స్టేట్ లెవెల్ ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.