కృష్ణా: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యులుగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సేవలు మరువలేనివన్నారు.