HYD: అయ్యప్ప భక్తులను అవమానించి అనుచితంగా వ్యాఖ్యానాలు చేసిన ఎస్సై అశోక్ సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసులు రెడ్డికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, అయ్యప్ప భక్త బృందం వినతి పత్రం అందజేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములను దూషించాడంతో వారు ఫిర్యాదు చేశారు.