కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం సోమవారం జాయింట్ కలెక్టర్ నవీన్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోవిందు, భోగి రెడ్డి, సుభాని, కోటేశ్వరరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.