NRML: కుబీర్ మండలం పార్డీ B గ్రామంలోని శ్రీ రాజా రాజేశ్వర ఆలయంలో చోరీకి యత్నించిన భైంసాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భైంసా ASP కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఆలయంలో చోరీకి యత్నించగా CC ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు.