KMM: ముదిగొండ మండలం గంధసిరిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 35 గేదెలకు గర్భకోశ చికిత్స చేసినట్లు మండల పశు వైద్యాధికారి అశోక్ తెలిపారు. పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు మండల పశువైద్యాధికారి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.