HYD: అశోక్ నగర్లో గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సురేఖ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా గాంధీ ఆసుపత్రిలో సురేఖ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కూతురు మృతదేహాన్ని చూసిన సురేఖ తల్లి బోరున విలపించారు. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.