KNR: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని గోలిపల్లి అంజలి హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుకుంటోంది. బీహార్ రాష్ట్రంలో పాతేనాలో ఈనెల 28 – 30 వరకు జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.