MBNR: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.