CTR: వి.కోట మండల కేంద్రంలో ఆదివారం తేనెటీగల దాడిలో 20 మంది గాయపడ్డారు. వి.కోటకు చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులు స్థానిక మునీశ్వరస్వామి ఆలయం వద్ద మునిదేవర కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అగరబత్తుల పొగకు ఒక్కసారిగా రెచ్చిపోయి అక్కడున్న వారిపై దాడి చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.