అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా కలెక్టర్ విజయకృష్ణకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు తెలిసిందే.