VSP: కొయ్యూరు మండలం ఆడాకుల గ్రామంలో ఈనెల 19న నిర్వహించతలపెట్టిన గ్రామ సభను రద్దు చేస్తున్నట్లు మండల తహసీల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్ బుధవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు మండలంలో రెవెన్యూ సదస్సులు పక్కాగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆడాకుల గ్రామ సభను గ్రామ సభ రద్దు చేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది మీడియాకు తెలియజేయడం జరుగుతుందన్నారు.