KDP: కొండాపురం మండలంలోని పి.అనంతపురం గ్రామ సమీపంలో నీల మల్లేశ్వర కొనలో నాగ ప్రతిమ చోరీ జరిగింది. సోమవారం కొందరు శివ భక్తులు మాల వేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారిలో గుర్తు తెలియని భక్తులు 2 కిలోల బరువు గల నాగపడిగ ప్రతిమను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపడిగ ప్రతిమ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని భక్తులు తెలిపారు.