KDP: ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పులివెందులలోని ఆయన నివాసము నందు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ప్రజలు విచ్చేసి ఎమ్మెల్సీకి తమ సమస్యలను విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.