NLR: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండి నెల్లూరులో పదికి పది స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో బలంగా నిలబడ్డారు. ఎవరికి భయపడకుండా టీడీపీని బలోపేతం చేశారు. వైసీపీ నాయకులను ఎదిరించి టీడీపీ కార్యకర్తలతో కలిసి పోరాటాలు చేశారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొనియాడారు.