NDL: నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి బాధిత నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.