TPT: ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరులోని క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం రోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు ఆపాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆందోళన చేశారు.