కృష్ణా: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను గుంటూరులోని వారి కార్యాలయంలో మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి జనసేన నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించమని ఆయనను కోరారు. తమ సమస్యలపై పెమ్మసాని సానుకూలంగా స్పందించారని జనసేన నేతలు తెలిపారు.