అన్నమయ్య: గవర్నమెంట్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లె పట్టణంలోని బిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మలిగి రాఘవరెడ్డి ఎన్నిక అయ్యారు. ఈ మేరకు సోమవారం కళాశాల నందు ఆయనకు తోటి అధ్యాపకులు సిబ్బంది ఘనంగా సత్కరించారు. అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు