PLD: నరసరావుపేటలోని కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలకు చెందిని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా పరిష్కరించి సమాధానం ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.