కోనసీమ: మండపేట పురపాలక సంఘ పరిధిలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్ టీవీ రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 28 వరకు ఆధార్ క్యాంపులు జరగనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఈ ఆధార్ క్యాంప్ వద్ద 0-6 సంవత్సరాల వయసుగల పిల్లలకు బాల ఆధార్, ఆ వయసు దాటిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.