VZM: గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు అని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం లక్కవరపుకోటలో నిర్వహించిన గ్రామ రెవిన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.