W.G:పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో రూ.18 లక్షలు వ్యయంతో నిర్మిస్తున్న సిమెంటు రహదారి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బండారు వెంకటరమణ సాయిబాబా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్బిశెట్టి సత్తిరాజు, మారిశెట్టి పోతురాజు, ఆదినారాయణ, కేత నాగేశ్వరరావు పాల్గొన్నారు.