CTR: పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం చోరీ జరిగింది. పూజారి మల్లికార్జున ఉదయం 6గంటలకు ఆలయ ప్రధాన గేటుకు తాళాలు తీసి వచ్చేశారు. గర్భగుడి తాళం తీయలేదు. సాయంత్రం ఆలయానికి వెళ్లగా లోపలి హుండీ పగలకొట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని కానుకలతో పాటు అమ్మవారి నాలుగు తాళిబొట్లు చోరీ అయినట్లు పూజారి తెలిపారు.