NDL: జిల్లాలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాల సబ్ డివిజన్ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.