KRNL: నగరంలో రహదారులపై ఆక్రమణలను తొలగించాలని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. స్థానిక రైల్వేస్టేషన్ కూడలి, అశోక్ నగర్, నరసింహారెడ్డి నగర్, సంకల్బాగ్ కాలనీల్లో కమిషనర్ పర్యటించి, మాట్లాడారు. రైల్వేస్టేషన్ వద్ద ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.