CTR: అమరజీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీ రాష్ట్ర సాధన కోసం ఆయన నిబద్ధతను గుర్తించుకోవాలని తెలిపారు. ఆయన ధైర్యం, దృఢ విశ్వాసం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, నిస్వార్థత అలవర్చుకోవాలని సూచించారు.