KRNL: కర్నూలులోని తుంగభద్ర నదీ తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. నదీతీర ప్రాంతాల పరిశుభ్రత, సుందరీకరణపై మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుకు సూచనలు ఇచ్చారు. అనంతరం హరహరి క్షేత్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.