కర్నూలు: కోసిగి మండలం సజ్జలగుడంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఆదివారం మంత్రాలయం టీడీపీ నేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కుమారుడు ప్యాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు. ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.