VZM: తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. ఆదివారం బాలాజి నగర్ జనసేన కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లబాయ్ పటేల్ల వర్ధంతి సందర్భంగా, ఆ మహానీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి అవనాపు విక్రమ్ నివాళ్లు అర్పించారు.