VZM: పొట్టి శ్రీరాములు చిర స్మరనీయులని, వారి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంను ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తదితరులు ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.