BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 1,99,248 మంది రామయ్య సేవలో తరించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే నెలలో 1,97,860 మంది స్వామివారిని దర్శించుకోగా గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది అని అధికారులు తెలిపారు.