HYD: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చెత్త సేకరణకు కొత్తగా 50 రిక్షాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రిక్షాలను చెత్త సేకరణదారులకు అందజేస్తున్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి, సులేమాన్ నగర్, ఇప్పటికే ఉన్న 30 రిక్షాలతో ఆయా ప్రాంతాలలోని చెత్తను సేకరిస్తున్నారు. ప్రతిరోజు రిక్షాదారుడు ఆయా ప్రాంతాలలో ఇంటింటి చెత్తతో పాటు ఓపెన్ పాయింట్లలోని చెత్తను సేకరిస్తున్నారు.