SDPT: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గంకు చెందిన 116 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మెరుగైన వైద్యం కోసం డబ్బులను వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేతో పాటు ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ ఉన్నారు.