యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేసారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.